అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరబోతున్న మధుర క్షణాలు ఆరంభం అయ్యాయి. అయోధ్యలో ఇవాళ శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు 8 వేల మంది అతిథులు ఆ వేడుకకు హాజరయ్యారు. శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్టించనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆలయ పరిసరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూమ్మీద ఉన్న వారిలో అదృష్టవంతుడిని తానే అన్నట్లు ఫీలవుతున్నాని యోగిరాజ్ తెలిపారు. మా పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తనపై ఉన్నట్లు చెప్పారు. శ్రీరాముడి ఎల్లప్పుడూ తనతోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు తనకు అనిపిస్తుందని యోగిరాజ్ తెలిపారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Ram Lalla idol sculptor, Arun Yogiraj says “I feel I am the luckiest person on the earth now. The blessing of my ancestors, family members and Lord Ram Lalla has always been with me. Sometimes I feel like I am in a dream world…” pic.twitter.com/Eyzljgb7zN
— ANI (@ANI) January 22, 2024