Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్లో కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పైలట్ అనుకుంటున్నారని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. బీజేపీ 400పైగా స్ధానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ 40 స్ధానాలు గెలుచుకోవడం కూడా కష్టమేనని మంత్రి పేర్కొన్నారు.
ఓటమి తప్పదని తెలిసే కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్పై ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటోందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ వాడిన రోజుల్లో పోలింగ్ బూత్లను లూటీ చేసేవారని, బ్యాలెట్ పేపర్లపై తప్పుడు మార్కింగ్ చేసేవారని పలు అక్రమాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ ఇవాళ ఈవీఎంల కారణంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత సాధ్యమైందని చెప్పారు.
Read More :
Raj Kundra | కోట్లు విలువైన ఆస్తులు అటాచ్.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన రాజ్ కుంద్రా