Raj Kundra | బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు చెందిన విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) గురువారం అటాచ్ చేసిన విషయం తెలిసిందే. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో (Bitcoin ponzi scam) దాదాపు రూ.98 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండడం ఓ రకమైన ఎదుగుదల లాంటిదే అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు గర్జిస్తున్న సింహం ఫోటోను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేస్తూ.. ‘మీకు అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. అది ఓ రకంగా భిన్నమైన ఎదుగుదల లాంటిదే’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, రాజ్కుంద్రా సంస్థ 2017లో బిట్కాయిన్ల రూపంలో సుమారు రూ.6,600 కోట్లు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు పది శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ఈ స్కీమ్లో మాస్టర్మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా సుమారు 285 బిట్కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ బిట్కాయిన్లతో ఉక్రెయిన్లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పుణెలోని ఒక ఫ్లాట్, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశామని, కేసులో నిందితులైన భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్లను అరెస్ట్ చేసి జైలుకు పంపామని, మరికొందరు పరారీలో ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు.
Also Read..
Polling Percent | త్రిపురలో 53.04%.. లక్షద్వీప్లో 29.91%.. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా
Manipur | మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం.. భయంతో పరుగులు తీసిన ఓటర్లు
Arvind Kejriwal | నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్