సిద్దిపేట, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్ర మం బుధవారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ఘనంగా నిర్వహించారు. హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ఉద య్ నాగరాజును శాలువాతో ఘనంగా స తరించారు.
ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివా స్, వంటేరు యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు అని కొనియాడారు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, ఎంతో కృషి, పట్టుదలతో ఎదిగాడని కొనియాడారు. ఉదయ్ నాగరాజును సన్మానించుకోవడమంటే యావత్ భారతీయులకు గర్వకారణం అన్నారు. నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అకడి ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షించారు.