Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 20 సార్లు ప్రజల ముందుకు తీసుకొచ్చినా వైఫల్యాన్ని మూటగట్టుకున్న రాహుల్ దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 62 సార్లు రాజ్యాంగాన్ని సవరించిన కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ను అవమానించిందని దుయ్యబట్టారు.
దేశాన్ని తప్పుదారి పట్టించిన రాహుల్ గాంధీ ఇంకా అసత్యాలను వల్లెవేస్తున్నారని, ఆయన తమ ప్రభుత్వ ఆర్డినెన్స్ పత్రాలనే చించివేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఎన్నో పధకాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మేలు చేకూర్చాయని చెప్పారు.
రాహుల్ అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. హిమాచల్ ప్రదేశ్లో అనురాగ్ ఠాకూర్ ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. హిమాచల్లోని నాలుగు లోక్సభ స్ధానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. 2019లో నాలుగు స్ధానాల్లోనూ బీజేపీ గెలుపొందగా వాటిని నిలుపుకునేందుకు శ్రమిస్తుండగా, కాషాయ పార్టీకి దీటైన పోటీ ఇస్తూ సత్తా చాటాలని కాంగ్రెస్ చెమటోడుస్తోంది. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
Read More :
Hyderabad | ఉద్యోగం ఇప్పిస్తానని భర్త టోకరా.. భార్యను ఎత్తుకెళ్లిన బాధితులు