NIA Team | పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ (East Medinipur) జిల్లాలోని భూపతినగర్ (Bhupatinagar)లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ బృందం ఇవాళ దాడులు చేసేందుకు అక్కడికి చేరుకుంది. అయితే, భూపతినగర్ వాసులు ఎన్ఐఏ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్ఐఏ అధికారులను చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనం అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలిసింది. వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
కాగా, భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్యబిలా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంటి వద్ద డిసెంబర్ 2022లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు 2023 జూన్లో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇవాళ భూపతినగర్కు వెళ్లారు.
#WATCH | West Bengal: NIA officers had to face protesters in Bhupatinagar while they were carrying out an investigation in connection with the Bhupatinagar, East Medinipur blast case. People allegedly tried to stop the NIA team from taking the accused persons along with them.… pic.twitter.com/KKL33S4Plm
— ANI (@ANI) April 6, 2024
Also Read..
Hardik Pandya | సోమనాథ్ ఆయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. VIDEO
Rishi Sunak | ఇంగ్లండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్.. VIDEO
Karimnagar | టిప్పర్ బోల్తా.. మట్టి మీదపడి ఇద్దరు యువతులు, ఓ యువకుడు మృతి