Maharashtra | ముంబై, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. రూ.45 వేల మందులు బయట నుంచి కొనుగోలు చేసి ఇచ్చామని, రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఇతర పరీక్షల కోసం రూ.10 వేల కంటే ఎకువ ఖర్చు చేసినా తల్లి బిడ్డ ఇద్దరూ మృతి చెందారని మృతురాలి బంధువులు ఆరోపించారు.
తనతో మరుగు దొడ్లు కడిగించిన ఎంపీ హేమంత్ పాటిల్పై దవాఖాన సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణాల నివారణకు చేపట్టిన చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.