భోపాల్, ఆగస్టు 29: పాడుబడిన ఇంటిని పునర్నిర్మిస్తున్న కొందరు కూలీలకు పురాతన బంగారు నాణేలు దొరికాయి. అయితే, యజమానికి తెలియకుండా వాళ్లు వాటిని పంచుకున్నారు. దుండగుల్లో ఒకడు తాగిన మత్తులో నోరుజారడంతో విషయం బయటపడింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగింది. నాణేలు, ఆభరణాల విలువ రూ. 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతుండగా, రూ. 1.25 కోట్ల వరకు ఉంటుందని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు.