న్యూఢిల్లీ : కారుచౌకగా లభించే ట్రెడ్మిల్ను కనిపెట్టిన వ్యక్తి ఇతడేనని, ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ఆయనకే ఇవ్వాలని కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫ్లోర్ మీద డిష్వాష్ లిక్విడ్ డ్రాప్స్ వేసి, ఆపై కొద్దిగా నీటిని జోడించి నేలను స్లిప్ అయ్యేలా చేస్తాడు. వీడియో కొనసాగుతుండగా ఆ సర్ఫేస్పై ట్రెడ్మిల్పై నడిచినట్టు నడుస్తూ ఒక్కసారిగా వేగం పుంజుకుంటాడు.
The lowest cost treadmill in the world. And this year’s Innovation Award trophy goes to… pic.twitter.com/oMlyEPBQoy
— anand mahindra (@anandmahindra) January 7, 2023
ప్రపంచంలోనే అత్యంత చవకైన ట్రెడ్మిల్..ఈ ఏడాది ఇన్ఫోవేషన్ అవార్డు గోస్ టూ..అంటూ ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 16 లక్షల మందికి పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ ఐడియా చాలా బావుందని కొందరు ప్రశంసించగా ఇది చాలా ప్రమాదకరమని మరికొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
అంబులెన్స్, ఆర్ధోపెడిక్ డాక్టర్ను అందుబాటులో ఉంచుకుని ఈ ట్రెడ్మిల్ ట్రై చేయాలని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది వినూత్న ఆవిష్కరణ కాదు..ముప్పుతో కూడుకున్నదని మరో యూజర్ రాసుకొచ్చారు.