Anand Mahindra : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రధాని ఇటీవల ప్రారంభించిన అటల్ సేతుపై ప్రయాణించాలన్న పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర కోరిక నెరవేరింది. ఈ ఐకానిక్ బ్రిడ్జిపై తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను కార్పొరేట్ దిగ్గజం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనవరి 12న ఇంజనీరింగ్ అద్భుతంగా పిలిచే దేశంలోనే అతిపెద్ద సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇక ఆనంద్ మహీంద్ర వంతెన మీదుగా సాగే ప్రయాణాన్ని హోవర్క్రాఫ్ట్లో “నీటిపై గ్లైడింగ్”తో పోల్చారు. పుణేకు రాకపోకలు సాగిస్తూ ఈ బ్రిడ్జిపై నుంచి ఆనంద్ మహీంద్ర ప్రయాణించారు. సంధ్యా సమయంలో బ్రిడ్జి అందాలను ఆస్వాదించేందుకు వంతెనపై మరోసారి ప్రయాణించేందుకు ఆసక్తిగా వేచిచూస్తున్నానని పేర్కొన్నారు.
Finally got to drive on the Atal Setu the previous weekend.
A fine piece of engineering that makes you feel like you’re a hovercraft gliding on water.
It was during daytime that I both traveled to and returned from Pune so I couldn’t experience the magnificent view at dusk as… pic.twitter.com/ddq2VZhG69
— anand mahindra (@anandmahindra) February 6, 2024
ఎట్టకేలకు ఈ వారాంతంలో అటల్ సేతుపై ప్రయాణించాను..ఇది నీటిపై హోవర్క్రాఫ్ట్ గ్లైడింగ్ అనుభూతి ఇచ్చే అద్భుత ఇంజనీరింగ్ కట్టడం ఇదని, తాను పుణేకు వెళ్లి వస్తూ పగటి వేళ బ్రిడ్జి మీదుగా వెళ్లానని అయితే సాయంత్రం వేళలో ఈ వైరల్ పిక్లో ఉన్న అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించలేకపోయానని ఆనంద్ మహీంద్ర ఈ పోస్ట్లో రాసుకొచ్చారు.
Read More :
TSRTC | మేడారం జాతరకు 2200 సిటీ బస్సులు.. ఆరు రోజుల పాటు నగరంలో 450 బస్సులే