న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ స్ఫూర్తిని నింపే పోస్టులు షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) తాజాగా మండే మోటివేషన్ పోస్ట్తో నెటిజన్ల ముందుకొచ్చారు. నేటి మండే మోటివేషనల్ పోస్ట్లో ఆనంద్ మహీంద్ర మొసలి బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న జింక వీడియోను పోస్ట్ చేస్తే ఏకాగ్రత ఎంతటి కీలకమో వెల్లడించారు.
Reflexes. Keep them sharp. Mindfulness is a great virtue when starting the week. 😊 #MondayMotivation . pic.twitter.com/bZocQwThIM
— anand mahindra (@anandmahindra) June 5, 2023
12 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోను ముందుగా క్లిప్స్ దట్ గో హార్డ్ అనే ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేయగా ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. వారం ఆరంభంలో ఆచరించాల్సిన ధర్మం ఏకాగ్రత అని తన పోస్ట్కు పారిశ్రామిక దిగ్గజం క్యాప్షన్ ఇచ్చారు. ఇక వైరల్ క్లిప్లో జింక నదిలో నీరు తాగుతుండగా అనూహ్యంగా దానిపై మొసలి దాడి చేయడం కనిపిస్తుంది.
మొసలిని పసిగట్టిన జింక ఒక్క ఉదుటన వెనుకకు జంప్ చేయడంతో లిప్తపాటులో బతికిపోవడం వీడియోలో చూడొచ్చు. ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన వెంటనే పెద్దసంఖ్యలో లైక్స్ రాబట్టడంతో పాటు రీట్వీట్స్ చేశారు. ఒత్తిళ్లను, సవాళ్లను అధిగమించేందుకు మనం నిరంతరం స్ప్రహలో ఉంటూ చురుకుగా వ్యవహరించాలని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More