Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) ఇటీవలే తరచూ భూకంపాలు (earthquake) చోటు చేసుకుంటున్నారు. స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తోంది. తాజాగా మరోసారి లడఖ్లో భూకంపం సంభవించింది.
శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు.
Earthquake of Magnitude:3.4, Occurred on 02-12-2023, 08:25:38 IST, Lat: 35.44 & Long: 77.36, Depth: 10 Km ,Location: Ladakh, India for more information Download the BhooKamp App https://t.co/2Pcus7oUlH@Dr_Mishra1966 @Indiametdept @ndmaindia @KirenRijiju @Ravi_MoES @DDNational pic.twitter.com/IY013zpcE7
— National Center for Seismology (@NCS_Earthquake) December 2, 2023
Also Read..
Ayyappa Deeksha | పడిపూజ ఎందుకు చేస్తారు.. అయ్యప్ప దీక్ష నియమాలు ఏంటి?
Health Tips | చలికాలం జర భద్రం.. ఈ జాగ్రత్తలు మస్ట్గా తీసుకోండి
Telangana | నెల రోజుల సందడికి బ్రేక్.. పోలింగ్ అయిపోవడంతో మూగబోయిన పల్లెలు