న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జమ్ము కశ్మీర్ సమగ్రాభివృద్ధికి సంబంధించి అమిత్ షా తన జమ్ము కశ్మీర్ పర్యటన సందర్భంగా కీలక భేటీలో అధికారులతో సమీక్షిస్తారు. పర్యటనలో భాగంగా జమ్ము కశ్మీర్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
తన పర్యటన సందర్భంగా జమ్ము కశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధానపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెద్దసంఖ్యలో యువతకు ఉపాధి కల్పించేలా హోంమంత్రి అమిత్ షా పలువురికి నియామక పత్రాలు కూడా అందచేస్తారని అధికారులు వెల్లడించారు.
Read More :
Migratory birds | త్రివేణి సంగమంలో సైబీరియన్ వలస పక్షుల సందడి.. Video