Migratory birds : దేశంలోని గంగా, యమునా నదీ తీరాల్లో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. నదీ తీరాల్లో విహార యాత్రలకు వెళ్లిన పర్యాటకులను, తీర్థయాత్రలకు వెళ్లిన భక్తులను ఈ రంగురంగుల పక్షులు అలరిస్తున్నాయి. పక్షుల అందాలకు ముగ్ధులై టూరిస్టులు బోట్లలో వాటి సమీపానికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
కాగా, ప్రతి ఏడాది శీతాకాలంలో సైబీరియన్ వలస పక్షులు మూడు నుంచి నాలుగు నెలలపాటు ఉత్తర భారతదేశంలోని నదీతీరాలకు వలస వస్తాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర సైబీరియన్ వలస పక్షుల సందడి మొదలైంది.
ఈ వలస పక్షుల రాకతో త్రివేణి సంగమం పరిసరాల్లోని పుష్కర ఘాట్లు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ఈ పక్షులు సందడిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ప్రాంతంలో సైబీరియన్ వలసపక్షల సందడికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు..
#WATCH | Uttar Pradesh | Siberian migratory birds flock to Prayagraj’s Triveni Sangam, adding to the beauty of the ghats. pic.twitter.com/fNdO0jvgcE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2024