Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు. అమేథి నుంచి రాహుల్ గాంధీ ఎందుకు బరిలోకి దిగలేదో ఓటర్లకు, మీడియాకు అర్ధమైందని అన్నారు.
గుజరాత్లోని గాంధీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీ 180 స్ధానాలకు మించి గెలవదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిసారీ ఈవీఎంలను నిందించడం పనిగా పెట్టుకుందని అమిత్ షా ఆరోపించారు. ఇవే ఈవీఎంలతో నే కాంగ్రెస్ తెలంగాణ, చత్తీస్ఘఢ్, రాజస్దాన్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిందని, వారు ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఈవీఎంలను నిందిస్తారని అన్నారు.
సందేశ్ఖాలి ఘటనతో టీఎంసీ హయాంలో మహిళలకు భద్రత లేదని తేటతెల్లమైందని మమతా బెనర్జీ సర్కార్పై అమిత్ షా విరుచుకుపడ్డారు. చత్తీస్ఘఢ్లో 29 మంది నక్సలైట్ల మృతిని విపక్షం బూటకపు ఎన్కౌంటర్గా అభివర్ణించడాన్ని కేంద్ర మంత్రి తిప్పికొట్టారు. విపక్షం మతిస్ధిమితం కోల్పోయిందని, మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరితే దేశం నుంచి రెండేండ్లలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని అమిత్ షా స్పష్టం చేశారు.
Read More :
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ