Loksabha Elections 2024 : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బీసీ ద్రోహులని, వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీలు వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తాము ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని తొలగిస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మీ ట్రాక్ రికార్డు చూస్తే మీ నానమ్మ దేశంలో ఒక్క దెబ్బతో ఎమర్జెన్సీ విధించారని, మీ తండ్రి ట్రిపుల్ తలాక్ను పునరుద్ధరించారని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మిత్రపక్షం ఎస్పీ బీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యహరిస్తున్నాయని మండిపడ్డారు.
Read More :
Rythu Bandhu | రైతుబంధు ఇక కొనసాగక పోవచ్చు? : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి