హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతవహించనున్నారు. ఇందులో మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పరిస్థితిపై సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.