Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తున్నది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో యాత్ర రూట్లో ఏర్పాటు చేసిన గుడారాలు కొట్టుకుపోయాయి. ఇద్దరు యాత్రికులు మరణించగా, పలువురు గాయ పడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్ల ద్వారా దవాఖానలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టారు. భారీగా వరద పోటెత్తడంతో తాత్కాలికంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
గురువారం అర్ధరాత్రి తర్వాత (శుక్రవారం ఉదయం ఒంటి గంట నుంచి) కశ్మీర్లోని రాంబన్ జిల్లా పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కురుస్తున్న వర్షంతో కొండ చరియలు, రాళ్లు విరిగి పడటంతో జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి. 6000 మంది యాత్రికులు చిక్కకున్నారు. శుక్రవారం ఉదయం విరిగి పడిన కొండ చరియలను తొలగించి రహదారిని పునరుద్ధరించారు. కొండ చరియలు విరిగి పడటంతో పూంచ్ జిల్లా మండి ప్రాంతంలోని ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి అబ్దుల్ కరీం (55) మరణించాడని పోలీసులు తెలిపారు.