న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వాన్ని అంతం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) పిలుపునిచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో’ సభలో ఆమె పాల్గొన్నారు. భారత్లోని 50 శాతం మహిళా జనాభా, తొమ్మిది శాతం గిరిజన సమాజం గళంగా తాను మీ ముందు ఉన్నానని తెలిపారు. దేశంలోని నియంతృత్వాన్ని అంతం చేసేందుకు ప్రతి ప్రాంతం నుంచి మీరు వచ్చారని చారిత్రక మైదానంలో జరుగుతున్న ఈ సభ నిరూపిస్తోందని అన్నారు.
కాగా, జేఎంఎం అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ను ఆయన భార్య కల్పనా సోరెన్ ఈ సందర్భంగా ఖండించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో ప్రజలంతా ‘ఇండియా’ కూటమితో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
#WATCH | INDIA alliance rally: Kalpana Soren, wife of JMM leader and former Jharkhand CM Hemant Soren; says, "I am standing in front of you as the voice of 50 per cent of India's women population and 9 per cent of the tribal community…Today this gathering in this historic… pic.twitter.com/pjDqYKWDSe
— ANI (@ANI) March 31, 2024