Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 10న ములాయం మరణించడంతో ప్రస్తుతం ఆ లోక్సభ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది.
ఇందులో భాగంగా మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 17న నామపత్రాల దాఖలుకు చివరి రోజు. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव – 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT
— Samajwadi Party (@samajwadiparty) November 10, 2022