జలౌన్ (యూపీ): కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శుక్రవారం జలౌన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘ధరలు పెరుగుతుండటంతో కుటుంబంపై పడుతున్న ఆర్థిక భారం గురించి ఇక్కడ కూర్చొన్న కుటుంబ పెద్దలకు తెలుసు. ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమవుతున్నామని భావిస్తున్న యువతకు తెలుసు కుటుంబం గురించి. వాళ్లకు (ప్రధాని మోదీ తదితరులు) ఏం తెలుసు’ అని ధ్వజమెత్తారు.