RLD : లోక్సభ ఎన్నికలకు ముందు జయంత్ చౌధరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఎన్డీయేతో చేతులు కలపవచ్చని సాగుతున్న ఊహాగానాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌధరి విద్యావేత్తని, రైతుల పోరాటాన్ని నిర్వీర్యం చేసేలా ఆయన వ్యవహరించబోరని అఖిలేష్ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీతో కలిసి పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించిన కొద్దరోజులకే ఆర్ఎల్డీ సీట్ల సర్ధుబాటు కోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుతోందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక యూపీలో ఏడెనిమిది స్దానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేస్తుందని, కాంగ్రెస్ 11 స్ధానాల్లో పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు కసరత్తు సాగుతోందని ఎస్పీ వర్గాలు చెబుతుండగా ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తుకు మొగ్గుచూపుతుందనే వార్తలు విపక్ష కూటమిలో కలకలం రేపాయి.
జయంత్ చౌధరి ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోబోరని అఖిలేష్ యాదవ్ భార్య, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. మన రెజ్లర్లను ఆ పార్టీ అవమానించిన క్రమంలో బీజేపీతో ఆర్ఎల్డీ జట్టు కట్టదని అన్నారు. మన రైతులను నేరుగా దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధరి తీసుకుంటారని తాను అనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Read More :
PM Modi: భారత భూభాగాన్ని శత్రువులకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే: ప్రధాని మోదీ