లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేటి ఔరంగజేబు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. తండ్రికే విధేయుడిగా లేని వ్యక్తి ప్రజలకు ఎలా విధేయుడిగా ఉంటారు అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని డియెరియాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్పై మండిపడ్డారు. ఆయన నేటి ఔరంగజేబు అని విమర్శించారు. ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెట్టాడని, సోదరులను చంపాడని తెలిపారు. ఆ మాదిరిగా అఖిలేష్ యాదవ్ వ్యవహరించారని దుయ్యబట్టారు. అఖిలేష్ తనను అవమానించినంతగా మరెవరూ అవమానించలేదని ఆయన తండ్రి ములాయం జీనే చెప్పి వాపోయారని గుర్తు చేశారు.
మరోవైపు సీఎం యోగి ఆదిత్య నాథ్కు ‘బుల్డోజర్ బాబా’గా పేరు పెట్టిన అఖిలేష్ యాదవ్కు శివరాజ్ సింగ్ చౌహాన్ కౌంటర్ ఇచ్చారు. బాబా (BABA)కు తన దైన శైలిలో భావార్థాన్ని వివరించారు. ‘బీ అంటే మాఫియాను అణిచే- ధైర్యవంతుడు, ఏ అంటే ఎల్లప్పుడూ ప్రజల కోసం-యాక్టివ్గా పని చేయడం. మరొక బీ అంటే తెలివైనవాడు, తక్షణ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, అలాగే బుల్డోజర్లతో శిక్షిస్తాడు. చివరి ఏ అంటే శ్రద్ధగల ప్రజా రక్షకుడు. ఇది యోగి ఆదిత్యనాథ్’ అని అన్నారు.
#WATCH Akhilesh is today's Aurangzeb. One who wasn't (loyal) to his father, how will he be(loyal)to you. Mulayam Singh himself said so…Aurangzeb jailed his father,killed his brothers. Mulayam Ji says no one has humiliated him the way Akhilesh did: MP CM SS Chouhan in Deoria, UP pic.twitter.com/XzGgfBTmfj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022