షాదోల్ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ ఏఎస్సైని ట్రాక్టర్తో తొక్కించి చంపారు. ఈ ఘటన షాదోల్ జిల్లా బదోలి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఏఎస్సై మహేంద్ర బాగ్రి ఒకరిని అరెస్ట్ చేసేందుకు ఇద్దరు సహోద్యోగులతో కలిసి వెళుతుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రాక్టర్ వారికి ఎదురైంది. వాహనాన్ని ఆపాలని ట్రాక్టర్ డ్రైవర్ రాజ్ రావత్కు సూచించినా, ట్రాక్టర్ను ఏఎస్సై మీదుగా పోనిచ్చాడు. దీంతో బాగ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితుడు ట్రాక్టర్ నుంచి కిందకు దూకి పారిపోయాడు.