లక్నో : యూపీలోని ప్రయాగరాజ్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య నేపధ్యంలో యోగి ఆదిత్యానాధ్ సర్కార్పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం 2.0 కొలువు తీరిన తర్వాత యూపీ నేరాలకు అడ్డాగా మారిందని అఖిలేష్ శనివారం ట్వీట్ చేశారు.
ప్రయాగరాజ్ జిల్లాలో ఓ కుటుంబంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారనే వార్త కధనం క్లిప్పింగ్ను కూడా అఖిలేష్ పోస్ట్ చేశారు. నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖగల్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
మృతులను రాహుల్ (42), ఆయన భార్య ప్రీతి (38) కుమార్తెలు మహి (15), పిహు (13), కుహు (11)గా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్పీ అభిషేక్ అగర్వాల్ తెలిపారు. యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరగాళ్లలో భయం లేకుండా పోయిందని, రాష్ట్రంలో నేరాల బుల్లెట్ ట్రైన్ దూసుకుపోతోందని విపక్ష నేత అఖిలేష్ యాదవ్ యోగి సర్కార్పై విమర్శలు గుప్పించారు.