Aircraft Crashes | ఒడిశా (Odisha)లో ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలా (Rourkela) వద్ద ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది (Aircraft Crashes). ఈ నైన్ సీటర్ ఫ్లైట్ రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, టేకాఫ్ అయిన వెంటనే ఫ్లైట్ కూలిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో ఎనిమిది మంది ఉన్నారు. ఇద్దరు పైలట్లు కాగా ఆరుగురు ప్రయాణికులు.
ఫ్లైట్ టేకాఫ్ అయి 10 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంజిన్ విఫలమవడంతో పంట పొలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ టీమ్ హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఫ్లైట్ ఇండియావన్ అనే సంస్థకు చెందినదిగా అధికారులు తెలిపారు.
Also Read..
Actor Vijay | జన నాయగన్ వివాదం.. విజయ్కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్
Actor Vijay | కరూర్ ఘటనపై దర్యాప్తులో మరో కీలక పరిణామం.. విజయ్ ప్రచార ర్యాలీ సీజ్
Beggar Raju: చలితో వణికిపోతున్న వారికి.. 500 బ్లాంకెట్లు దానం చేసిన యాచకుడు