న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Pollution) తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల ఎంట్రీపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో తక్షణమే జీఆర్ఏపీ షెడ్యూల్ను అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని చాలా ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 346గా ఉన్నట్లు సీపీసీబీ తెలిపింది.
#WATCH | Latest ANI drone camera footage from Signature Bridge in Delhi shows the city shrouded in a thick blanket of haze.
The air quality in Delhi is in ‘Severe’ category today as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/cSWsP3QGRy
— ANI (@ANI) November 3, 2023
లోధీ రోడ్, జహంగిర్పురి, ఆర్కే పురం, ఐజీఐ ఎయిర్పోర్టులో వాయు నాణ్యత 438, 491, 486,473గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. వాయు నాణ్యతను పెంచేందుకు ఢిల్లీ మున్సిపాల్టీ పలు ప్రాంతాల్లో రోడ్లు, చెట్లపై నీళ్లు చల్లుతోంది. వాయు నాణ్యత క్షీణిస్తున్న కారణంగా ప్రైమరీ స్కూళ్లను రద్దు చేశారు. ఎయిర్ క్వాలిటీ 400 దాటిన ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిషేధిస్తున్నామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
#WATCH | CORRECTION Delhi: Sprinkling of water being done in the Lodhi Road area by New Delhi Municipal Council*, as a measure against the rise in Air Quality Index (AQI) in the city. pic.twitter.com/u1HtCrZVb0
— ANI (@ANI) November 3, 2023