Loksabha Elections 2024 : నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్పై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు భగ్గుమన్నారు. తమ వద్ద అణు బాంబు ఉందని ఇప్పటివరకూ పాకిస్తాన్కు చెందిన కొందరు ఉగ్రవాద నేతలు చెబితే ఇవాళ ఏకంగా విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి, సీనియర్ నేత ఫరూక్ అబ్ధుల్లా అవే మాటలు చెప్పడం విచారకరమని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ప్రతినిధి సుధాన్షు త్రివేది పేర్కొన్నారు.
బీజేపీ, మోదీ ఎన్నికల్లో ఓటమి పాలు కావాలని పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌధరి కోరుకుంటే పాక్ 26/11కు నైతికంగా కాంగ్రెస్ నేత విజయ్ వడెటివార్ అనుకూలంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. పాక్ తప్పిదాలను కప్పిపుచ్చేలా పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రకటన ప్రయత్నించిందని అన్నారు.
కాంగ్రెస్ నేత శశి థరూర్ బంగ్లాదేశీ పత్రికలో రాసిన వ్యాసంలో మోదీ ఇంటిబాట పడతారని, కశ్మీర్ను తాను భారత పాలనలోని కశ్మీర్గా వ్యవహరిస్తానని రాసుకొచ్చారు. ఇలా కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి నేతలు పాక్ పాట పాడుతున్నారని విమర్శించారు. ఇండియా కూటమి మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని, ఇండియా కూటమి నేతలపై పాకిస్తాన్ ముద్ర ఉందని ప్రధాని ఆరోపించిన విషయాన్ని సుధాన్షు త్రివేది గుర్తు చేశారు. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ గాజులు తొడుక్కోలేదని, ఆదేశం వద్ద అణుబాంబు ఉన్న విషయం గుర్తెరగాలని ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Read More :
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం