Observers | ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్ఠాత్మక లోక్సభ నియోజకవర్గాలైన అమేథి (Amethi), రాయ్బరేలి (Raebareli )కి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను (Observers) నియమించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలి లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel)ను అబ్జర్వర్గా నియమించారు. ఇక అమేథి స్థానానికి రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)ను ఎన్నికల పరిశీలకుడిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా భావించే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇటీవలే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ్బరేలిలో రాహుల్ పోటీ చేస్తుండగా.. అమేథిలో గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను హస్తం పార్టీ బరిలోకి దింపింది. ఇక్కడ కిషోరి లాల్ శర్మపై బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీకి దిగారు. ఇక రాయ్బరేలిలో దినేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ నుంచి రాహుల్పై పోటీ చేస్తున్నారు.
#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv
— ANI (@ANI) May 6, 2024
Also Read..
Priyanka Chopra | ఆ వైరస్తో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త.. ఇన్స్టా ద్వారా వెల్లడి
Wildfires | ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. ఐదుగురు మృతి
Bomb Threats | అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు