Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. గతేడాది ఆరంభంలో మూత్ర విసర్జన ఘటనలతో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఫుడ్ విషయం, క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికుల ప్రవర్తన ఇలా తరచూ ఏదో ఒక వివాదం ఎయిర్ ఇండియా సంస్థను వెంటాడుతూనే ఉంది. తాజాగా కేబిన్ సిబ్బందితో (crew members) వాగ్వాదానికి దిగిన కారణంతో (argument) మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసి మరో వివాదంలో చిక్కుకుంది.
మార్చి 5వ తేదీన ఢిల్లీ నుంచి లండన్కు వెళ్తున్న ఏఐ 161 విమానంలో మహిళా ప్రయాణికురాలు కేబిన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దీంతో పైలట్ సూచనల మేరకు ఆమెను సిబ్బంది విమానం నుంచి కిందకు దింపేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఆ మహిళా ప్రయాణికురాలు బిజినెస్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. విమానం టేకాఫ్కు ముందు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు చెప్పారు. దీంతో పైలట్ సూచనల మేరకు ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలోనే (Delhi airport) కిందకు దింపేసినట్లు తెలిపారు. అయితే, రాతపూర్వక హామీ పత్రం తీసుకున్న తర్వాత ఆ మహిళా ప్రయాణికురాలిని మరో విమానంలో పంపినట్లు వివరించారు.
Also Read..
Bill Gates | అంబానీ బాష్కు గర్ల్ఫ్రెండ్తో హాజరైన బిల్గేట్స్.. మరోసారి తెరపైకి ప్రేమ వ్యవహారం
Water Crisis | బెంగళూరులో వాటర్ ట్యాంకర్ల నిలువు దోపిడీ..! అల్లాడిపోతున్న ప్రజలు
PM Modi | శ్రీనగర్లో మోదీ.. దూరం నుంచే శంకరాచార్య కొండను చూస్తూ