Loksabha Elections : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 16 మంది అభ్యర్ధులతో కూడిన తుది జాబితాను ఏఐఏడీఎంకే గురువారం విడుదల చేసింది. ఏఐఏడీఎంకేపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఎంజీఆర్ స్ధాపించిన పార్టీని అనంతరం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జయలలిత ముందుకు నడిపించారని పార్టీ నేత పళనిస్వామి జాబితాను వెల్లడిస్తూ పేర్కొన్నారు.
తమ పార్టీ ఎన్నో ఆటుపోట్లను అధిగమించిందని, న్యాయపరంగా అన్ని అడ్డంకులు అధిగమిస్తానమి చెప్పారు. ఇక ఏఐఏడీఎంకే జాబితాలో శ్రీపెరంబదూర్ నుంచి ప్రేమ్కుమార్కు చోటు లభించింది. ఇక ఎస్ పశుపతి (వెల్లూర్), ఆర్ అశోకన్ (ధర్మపురి), కలియపెరుమాల్(తిరువన్మలై), కుమారగురు (కల్లకురిచి) పి. అరుణాచలం (తిరుపూర్), డీ లోకేశ్ తమిళ్ సెల్వన్ (నీల్గిరి), సింగై రామచంద్రన్ (కోయంబత్తూర్), కార్తికేయన్ (పొల్లాచ్చి)లను లోక్సభ ఎన్నికల బరిలో నిలిపింది.
కరుప్పయ (తిరుచ్చి). చంద్ర మోహన్ (పెరంబలుర్), బాబు (యయిలదుతురై), పనగూరి ధస్ (శివన్గంగై), శివసామి వెదన్మణి (తూత్తుకుడి) చోజన్ (తిరునల్వేలి), నజ్రుత్ (కన్యాకుమారి), జీ తమిళ్ వేదన్ (పాండిచ్చేరి)లను ఏఐడీఎంకే లోక్సభ అభ్యర్ధులుగా ప్రకటించింది. విలవన్కోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాణిని పార్టీ అభ్యర్ధిగా ఏఐఏడీఎంకే వెల్లడించింది.
Read More :
Solar Eclipse | ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ దేశంలో అంధకారం