భువనేశ్వర్ : బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన (Caste Census) వివరాలను వెల్లడించిన నేపధ్యంలో ఈ దిశగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా సర్కార్ సైతం పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి నివేదికను విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఓబీసీ జనగణన నివేదికను వెల్లడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చర్యలు చేపడుతున్నదని ఓ బీజేడీ ఎమ్మెల్యే తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఐదు ముస్లిం వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టడం కోసం సామాజికార్ధిక సర్వే నిర్వహిస్తామని అసోం ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక గుర్తింపు, విద్య, ఆర్ధిక రంగాల్లో వారి అభివృద్ధికి ఈ సర్వే బాటలు వేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇక బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన నివేదిక ఆధారంగా రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర జనాభా 13.07 కోట్లు కాగా అందులో అత్యంత వెనుకబడిన వర్గాల వారు 36 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల వారు 27.13 శాతం ఉన్నట్టు వెల్లడైంది.
Read More :
Italy Bus Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు పిల్లలు సహా 21 మంది దుర్మరణం