Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides)లు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం కూడా ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నీట్ కోచింగ్ తీసుకుంటున్న జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రిచా సిన్హా (16) బుధవారం తన రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి (Rajasthan minister) శాంతి కుమార్ ధరీవాల్ (Shanti Kumar Dhariwal ) స్పందించారు. ఈ మేరకు కోటాలో తరచూ వెలుగు చూస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫైర్లు, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని వ్యాఖ్యానించారు.
16 ఏళ్ల రిచా సిన్హా మృతి ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ‘విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ప్రతి కేసులోనూ లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఝార్ఖండ్ బాలిక ఆత్మహత్య కేసులోనూ ఆమెకు అఫైర్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సూసైడ్ లెటర్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది’ అని ధరీవాల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా చదువులో ముందుండాలంటూ తల్లిదండ్రులు తెచ్చే ఒత్తిడి కూడా విద్యార్థుల మరణాలకు ఓ కారణమని ఆయన అన్నారు.
ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కోచింగ్ కోసం కోటాకు వెళుతుంటారు. అక్కడ హాస్టల్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవలే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
మరోవైపు విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Vijay Deverakonda | ఒక్కో కుటుంబానికి రూ.లక్ష.. లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Tattoos | కూతురిపై ప్రేమ.. ఒంటిపై 600కిపైగా టాటూలతో వరల్డ్ రికార్డు
Google Lay Offs | ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన గూగుల్.. వందలాది మందిపై వేటు