అలీగఢ్, మే 28: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో కల్తీ మద్యం తాగి శుక్రవారం 15 మంది చనిపోయారు. మరో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలీగఢ్లోని కార్సియా గ్రామంలో లైసెన్సు ఉన్న ఓ వైన్ షాపులో ఈ కల్తీ మద్యాన్ని అమ్మారు. కార్సియా గ్రామంలోనే కాక చుట్టు పక్కల ఊర్లలో కూడా చాలా మంది మద్యం కొన్నట్టు స్థానికులు చెప్పారు.