Jalandhar Bypoll | కాంగ్రెస్ (Congress) పార్టీ కంచుకోటను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బద్దలు కొట్టింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్సభ స్థానానికి (Jalandhar Lok Sabha constituency) జరిగిన ఉప ఎన్నికలో (Bypoll) ఆ పార్టీ భారీ విజయం సాధించింది. సుమారు 24 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న జలంధర్లో.. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ (Sushil Kumar Rinku) తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కరమ్ జీత్ కౌర్ (Karamjit Kaur)పై 58 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రింకూకు 3,02,097ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 2,43,450 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,58,354 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. 1,34,706 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.
కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న జలంధర్ లోక్సభ స్థానంలో ఆప్ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) హర్షం వ్యక్తం చేశారు. అపూర్వ విజయంగా అభివర్ణించారు. ‘ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. పంజాబ్ను అభివృద్ధి చేసేందుకు మరింత కష్టపడతాము’ అని అన్నారు.
జలంధర్ ఎంపీ సంతోక్ సింగ్ ఛౌదరి గుండెపోటుతో హఠాన్మరణం పాలవడంతో ఆ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. గత జనవరిలో రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సంతోక్ సింగ్ గుండెపోటుతో మృతిచెందారు. ఈ నెల 10వ తేదీన జలంధర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
#WATCH | Punjab: Aam Aadmi Party's Sushil Kumar Rinku wins #Jalandhar Lok Sabha by-election. pic.twitter.com/NtTCT6skRd
— ANI (@ANI) May 13, 2023
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Parineeti Chopra | పరిణీతి-రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్.. ఢిల్లీకి చేరుకుంటున్న సెలబ్రిటీలు
Siddaramaiah | కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం