Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో సిసోడియా గురువారం ఉదయం ట్వీట్ చేశారు. ‘గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరిస్తోంది. జాతీయ రాజకీయాల్లో మొదటి సారిగా విద్య, ఆరోగ్యం ప్రధాన అంశాలుగా నిలిచాయి..’ అంటూ ట్వీట్ చేశారు.
ఒక రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ పార్టీగా అవతరించనుంది.
गुजरात की जनता के वोट से आम आदमी पार्टी आज राष्ट्रीय पार्टी बन रही है.
शिक्षा और स्वास्थ्य की राजनीति पहली बार राष्ट्रीय राजनीति में पहचान बना रही है.
इसके लिए पूरे देश को बधाई.
— Manish Sisodia (@msisodia) December 8, 2022