కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ధనోరా ప్రాంతానికి చెందిన కుడియం అర్జున్ అనే యువకుడిని మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి అపహరించుకువెళ్లి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామ సమీపంలో నడిరోడ్డుపై వదిలేశారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు ఘటనా స్థలంలో కరపత్రాలు లభించాయి.