కౌశాంబి: దేవుడిపై కోసంతో ఒక యువకుడు గుడిలోని శివలింగాన్ని అపహరించాడు. యూపీలోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. చోటు (27) అనే యువకుడు ఒక యువతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ, అతని కుటుంబం వారి పెండ్లికి అంగీకరించ లేదు.
భగవంతుడిని ప్రార్థిస్తే ఆయనే తన వారి మనసు మార్చి తమ పెండ్లికి ఓకే చెప్పిస్తారని భావించి స్థానిక శివాలయంలో నెల రోజులుగా పూజలు చేశాడు. అయితే అతని పూజలు ఫలించకపోవడంతో తన కోరిక తీర్చని దేవుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 1న దేవాలయంలోని శివలింగాన్ని అపహరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.