JN.1 | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా డిసెంబర్ 28వ తేదీ వరకూ ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 145కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
145 కేసుల్లో అత్యధికంగా కేరళలో 41 వెలుగు చూశాయి. గుజరాత్లో 36, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో రెండు, ఢిల్లీలో ఒకరికి జేఎన్.1గా నిర్ధారణ అయ్యింది. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకూ పరీక్షించిన శాంపిల్స్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు వెల్లడించాయి.
A total of 145 cases of JN.1 variant have been reported till 28th December, these samples were collected between 21 November and 18th December 2023: Sources
— ANI (@ANI) December 29, 2023
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
800కు చేరువలో కొత్త కేసులు..
ఇదిలా ఉండగా.. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 798 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది.
Also Read..
Coronavirus | 800కు చేరువలో కొత్త కేసులు.. ఐదు మరణాలు
Pakistan | పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
Donald Trump | ట్రంప్కు మరో షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం