Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. ఈ క్రమంలో యాత్ర తిరిగి సోమవారం జలంధర్ జిల్లా అదంపుర్ నుంచి ప్రారంభమైంది. చలిని సైతం లెక్కచేయకుండా పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ యాత్రలో ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఈ యాత్ర పంజాబ్లోని హోషియాపూర్ (Hoshiapur) లో సాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి యాత్రలో నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి సెక్యూరిటీని తప్పించుకుని రాహుల్గాంధీ దగ్గరకు వచ్చి కౌగలించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే తేరుకున్న శ్రేణులు అతన్ని పక్కకు నెట్టేశారు. అనంతరం రాహుల్ తన యాత్రను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Punjab: A man tried to hug Congress MP Rahul Gandhi, during Bharat Jodo Yatra in Hoshiarpur, was later pulled away by workers.
(Source: Congress social media) pic.twitter.com/aybyojZ1ps
— ANI (@ANI) January 17, 2023