భువనగిరి టౌన్, ఏప్రిల్ 28 : సామాజిక దూరం, మాస్కు, శానిటైజర్తోనే కరోనాను కట్టడి చేయవచ్చని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో కరోనా పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండో దశలో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉందని చెప్పారు. కరోనా ఉందన్న సందేహం వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలన్నారు. నిర్ధారణ అయితే వెంటనే డాక్టర్లను సంప్రదించి హోంఐసొలేషన్లోకి వెళ్లాలని చెప్పిన ఆయన అవసరమైతే దవాఖానల్లో అడ్మిట్ కావాలన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, మండల వైద్యాధికారి డాక్టర్ కె.లీలావతి, వైద్య సిబ్బంది డాక్టర్ మురళి, కౌన్సిలర్ చెన్నస్వాతి పాల్గొన్నారు.
భౌతిక దూరం పాటించకుంటే చర్యలు తప్పవు
రామన్నపేట, ఏప్రిల్28: భౌతికదూరం పాటించకుంటే చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్, ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వివిధ వ్యాపార సముదాయాల వద్ద భౌతికదూరం పాటించే విధంగా మార్కింగ్ చేయించారు. కొనుగోలుదారులు తప్పకుండా భౌతిక దూరం పాటించేలా చర్య లు తీసుకోవాలని కోరారు.
వలిగొండ మండలంలో 40 మందికి కరోనా
వలిగొండ, ఏప్రిల్ 28: మండలంలో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని వేములకొండ, వర్కట్పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 177 మందికి నిర్వహించిన పరీక్షల్లో 40 మందికి కరోనా నిర్ధారణ అయిందని, బాధితులను హోం క్వారంటైన్కు తరలించి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
23మందికి కరోనా పాజిటివ్
బొమ్మలరామారం, ఏప్రిల్ 28: మండలంలో60 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి క్రాంతి బుధవారం తెలిపారు. ప్రజలు శానిటైజర్స్, మాస్కులు తప్పకుండా వాడాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నారాయణపురంలో 104 మందికి కొవిడ్ వ్యాక్సిన్
సంస్థాన్నారాయణపురం,ఏప్రిల్ 28: మండలం వ్యాప్తంగా బుధవారం 104 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు. పీహెచ్సీలో 31మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 11మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
గుండాల మండలంలో 11 ..
గుండాల, ఏప్రిల్ 28 : మండల పరిధిలో బుధవారం 11 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నూనెగూడెం-1, సుద్దాల-1,సీతారాంపురం-1, బండకొత్తపల్లి-1, వస్తాకొండూర్ 2, మాసాన్పల్లి-2, బురుజుబావిలో 3 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో 24 ..
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 28: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 80 మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. అదేవిధంగా 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వివిధ గ్రామాలకు చెందిన 24 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. మండలంలోని పుల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టోనిబావికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తి హైదరాబాద్లో నివాసం ఉంటూ కరోనాతో మృతి చెందాడు. గ్రామ సర్పంచ్ పెసరు గిరిజాగోపాల్రెడ్డి సహకారంతో అతడి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
మోటకొండూర్లో 68 మందికి కరోనా టీకా
మోటకొండూర్, ఏప్రిల్ 28: మండల కేంద్రంలోని పీహెచ్సీలో 68 మందికి కరోనా టీకా వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ బుధవారం తెలిపారు. అదే విధంగా స్థానిక పీహెచ్సీలో 41 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు.
అడ్డగూడూరులో 12 పాజిటివ్ కేసులు
అడ్డగూడూరు,ఏప్రిల్ 28: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 79 మందికి కరోనా పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు ల్యాబ్టెక్నిషియన్ బాలెంల అరవింద్ తెలిపారు. 11 మందికి టీకా వేసినట్లు తెలిపారు.