Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తమిళనాడులోని దిండిగల్ జిల్లా రెడ్డియరచత్రంలోని ఓ పోలింగ్ కేంద్రంలో 102 ఏండ్ల మహిళ చిన్నమ్మాళ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేతికర్ర ఊతంతో ఆమె స్వయంగా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చి ఓటు వేశారు.
మరోవైపు తమిళనాడులో 39 లోక్సభ స్ధానాలకు తొలి దశలో ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో విపక్ష ఇండియా కూటమి డీఎంకే ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేపట్టడంతో ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాషాయ పార్టీ ఆశలు పెంచుకుంది.
#WATCH | Dindigul, Tamil Nadu: A 102-year-old lady cast her vote at Reddiyarchatram in Dindigul district. pic.twitter.com/zMa4589MAV
— ANI (@ANI) April 19, 2024
Read More :
Jyoti Amge | ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే