భోపాల్: గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుమార్తె ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది. ఆసుపత్రి సిబ్బంది సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Old Woman Gang Raped) మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు పొలంలోని గుడిసెలో నివసిస్తున్నది. మార్చి 5న రాత్రి వేళ ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. గుడిసెలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, మరో గ్రామంలో నివసిస్తున్న కుమార్తెకు మరునాడు ఈ విషయాన్ని ఆ వృద్ధురాలు చెప్పింది. దీంతో ఆమె కుమార్తె అక్కడకు చేరుకున్నది. లైంగిక దాడి వల్ల గాయపడిన తల్లిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ బృందాలను నియమించారు. నిందితుల గురించి సమచారం ఇచ్చిన వారికి రూ.10,000 రివార్డును కూడా ప్రకటించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి