Karnataka | బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైర్లో కూర్చొన్న డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని పట్ల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అమర్యాదగా ప్రవర్తించారు. డిప్యూటీ స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేసి, ఆయన గౌరవానికి భంగం కలిగించారు. పేపర్లు విసిరేసిన 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన వారిలో సునీల్ కుమార్, ఆర్ అశోక్, సీఎన్ అశ్వథ్ నారాయణ్, యశ్పాల్ ఆనంద్ సువర్ణ, డీ వేదవ్యాస్ కామత్, అర్వింద్ బెల్లాడ్, అరగ జ్ఞానేంద్ర, ఉమానాథ కొటైన్, ధీరజ్ మునిరాజు, భరత్ శెట్టి ఉన్నారు.
Karnataka Legislative Assembly Session 2023 | Sunil Kumar, R Ashok, CN Ashwath Narayan, Yashpal Anand Suvarna, D Vedavyas Kamath, Arvind Bellad, Araga Jnanendra, Umanatha Kotian, Dheeraj Muniraju and Bharath Shetty Y, have been suspended for this session for throwing paper on…
— ANI (@ANI) July 19, 2023