న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో కొత్తగా 841 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 227 రోజుల వ్యవధిలో ఇదే గరిష్ఠం. అంతకుముందు ఈ ఏడాది మే 19న 865 కేసులు నమోదయ్యాయి. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,309కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించారు. కేరళ, కర్ణాటక, బీహార్లలో ఒకరు చొప్పున మృతిచెందారు.