Bihar Liquor | సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ ( Bihar)లో అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కొందరు వ్యాపారులు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని మోతిహారి (Motihari)లో శనివారం కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 25 మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఏప్రిల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది. అయినప్పటికీ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
Also Read..
Lengthening surgery | అమ్మాయిలు డేటింగ్కు రావట్లేదని.. రూ.కోటికి పైనే ఖర్చు చేశాడు
Ajith Kumar | గొప్ప మనసు చాటుకున్న హీరో అజిత్.. లేడీ ఫ్యాన్ లగేజ్ మోసిన స్టార్ హీరో
Vignesh Shivan | నయన్తో ప్రేమ అలా మొదలైంది : విఘ్నేశ్ శివన్