Accident | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Accident). పాట్నా (Patna)లో ఓ క్రేన్ను ఆటో ఢీ కొట్టింది (Auto Hits Crane). ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాలోని రామ్లఖన్ పాత్ ప్రాంతంలో (Ramlakhan Path area) మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగమైన ఓ భారీ క్రేన్ను ఆటో అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు పాట్నా సెంట్రల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Seema Haider | సీమా హైదర్కు నోయిడా కోర్టు నోటీసులు
Salman Khan | కాల్పుల ఘటన.. సల్మాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
Delhi Airport | ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. టాప్ టెన్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్