Seema Haider | భారత్లోకి అక్రమంగా ప్రవేశించి నోయిడా వ్యక్తి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ (Seema Haider)కు కోర్టు నోటీసులు (Noida Court) పంపింది. వీరి పెళ్లి చెల్లుబాటు కాదంటూ ఆమె మొదటి భర్త గులాం హైదర్ (Ghulam Haider) ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సీమా హైదర్కు నోటీసులు పంపింది. మే 27న కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది.
కాగా, సీమా హైదర్కు నోయిడా వ్యక్తి సచిన్ మీనాతో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని ఆమె మొదటి భర్త గులాం హైదర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత న్యాయవాది ద్వారా నోయిడాలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గులాం హైదర్ తరుఫున భారత్కు చెందిన న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. గులాం హైదర్ నుంచి సీమా హైదర్ విడాకులు పొందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సచిన్తో ఆమె పెళ్లి చెల్లదని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు దీనిపై నివేదిక సమర్పించాలని నోయిడా పోలీసులకు నోటీసు జారీ చేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీమా హైదర్కు నోటీసులు పంపింది.
Also Read..
Salman Khan | కాల్పుల ఘటన.. సల్మాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
BJP | ఏడుగురు అభ్యర్థులతో బీజేపీ 12వ జాబితా.. బెంగాల్లో అభిషేక్ బెనర్జీతో అభిజిత్ దాస్ ఢీ
Delhi Airport | ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. టాప్ టెన్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్