Salman Khan | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కలిశారు. సోమవారం అర్ధరాత్రి బాంద్రా (Bandra)లోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ (Galaxy Apartments)లో ఉన్న సల్మాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు, నటుడితో సీఎం మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
కాగా, ఘటన జరిగిన వెంటనే సల్మాన్తో సీఎం ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తాజాగా నివాసానికి వెళ్లి సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. సీఎంతోపాటు పలువురు కాంగ్రెస్, శివసేన, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా సల్మాన్ను కలిసినట్లు తెలిసింది.
ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారిని గుజరాత్లోని భుజ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విక్కీ సాహబ్ గుప్తా, సాగర్ శ్రీజోగేందర్ పాల్గా గుర్తించారు. వీరిద్దరు నవీ ముంబైలోని పన్వెల్లో ఉన్న హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లు అధికారులు చెప్పారు. సల్మాన్ ఖాన్కు పన్వెల్లోనే ఫాంహౌస్ ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Delhi Airport | ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. టాప్ టెన్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్
BJP | ఏడుగురు అభ్యర్థులతో బీజేపీ 12వ జాబితా.. బెంగాల్లో అభిషేక్ బెనర్జీతో అభిజిత్ దాస్ ఢీ
Aishwarya Rajinikanth | ధనుష్ – ఐశ్వర్య జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు