తిరుపతి: రెండేండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ 22 మంది ఎంపీలను, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ చేసిందేమిటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆచరణలో అమాయకులపై కేసులు పెట్టి కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తన జోలికి రావాలని, అలా చేస్తూ చూసుకుందాం అని సవాల్ విసిరారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తీరుపై తీవ్రస్థాయిలో పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాను రూ.కోట్లు పన్ను కట్టాను తప్ప.. కాంట్రాక్టులు కాజేయలేదన్నారు.
‘తిరుపతి నడిబొడ్డునుంచి వైఎస్సార్సీపీని హెచ్చరిస్తున్నా.. ఇది నవతరం .. చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తాం. ప్రతీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గూండాలా మాట్లాడుతున్నారు. అన్నమయ్య నడయాడిన నేల, కృష్ణదేవరాయులు ఏలిన నేల ఇది. పోరాడితే బానిస సంకెళ్లు పోతాయి. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్లు లేవు. అందుకే నేను మళ్లీ సినిమాలు చేస్తున్నా’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి నుంచి బీజేపీ గెలిచిందని పవన్ గుర్తుచేశారు. బీజేపీకి యంత్రాంగం బలంగా ఉన్నందున ఇప్పుడు తోడ్పాటునందిస్తే రాబోయే సంవత్సరాల్లో ఏపీ దశ, దిశ మనం నిర్దేశించే శక్తి ఉంటుందనే ఉద్దేశంతోనే బీజేపీకి ఈ సీటు ఇచ్చామని, కనుక బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రత్నప్రభను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్